Chatla Sriramulu-చాట్ల శ్రీరాములు
- చాట్ల శ్రీరాములు ప్రముఖ తెలుగు నాటకరంగ నిపుణులు మరియు సినిమా నటులు.
- పేరు : చాట్ల శ్రీరాములు,
- పుట్టిన ఊరు : బెజవాడ
- పుట్టినతేదీ : 1931 డిసెంబర్ 5 తేదీ
కెరీర్ :
- పన్నెండు సంవత్సరాల వయసులో విజయవాడలో దేశిరాజు రామారావు దర్శకత్వంలో ప్రదర్శించిన ‘మేవాడు పతనం’ అనే హిందీ నాటకంలో ఓ బాలుని పాత్ర ద్వారా రంగస్థల ప్రవేశం చేశారు. బి.కాం. చదువుతున్న రోజుల్లో నటుడు కావాలన్న కాంక్ష, నాటకం పట్ల ఉత్సాహాన్ని పెంచుకొన్నారు. చివరి సంవత్సరంలో ఉన్నప్పుడు విశాఖపట్టణంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు నిర్వహించే అభ్యుదయ నాటక ఉత్సవాల్లో ఎస్.ఆర్.ఆర్. కళాశాల పక్షాన ‘మాష్టర్జీ’ నాటకాన్ని ప్రదర్శించారు. అందులో శ్రీరాములు ఉత్తమ నటుడిగా బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు.
- గొల్లపూడి మారుతీరావు రాసిన ‘లావాలో ఎర్రగులాబీ’ నాటకాన్ని చాట్ల దర్శకత్వం బంగారానికి తావి అబ్బడం లాంటిదని ఎందరో విమర్శకులు ప్రశంసించారు.
- చాట్ల. ఆనాటి ప్రముఖ నటుడు కె. వెంకటేశ్వరరావుతో కలిసి ‘కాళరాత్రి’ అనే నాటకానికి దర్శకత్వం వహించారు. కొర్రపాటి గంగాధరరావు రచించిన ‘విషకుంభాలు’, ‘డిటెక్టివ్’, ‘భవబంధాలు’, ‘తెలుగు కోసం’ మొదలైన నాటకాల్లో ప్రధాన పాత్రలు పోషించారు*
- 1954 ప్రాంతంలో రససమాఖ్య ప్రదర్శించిన ‘దొంగవీరుడు’, ‘మాస్టర్జీ’ మొదలైన నాటకాలకు పన్నెండు బహుమతులు అందుకున్నారు
- వీరు ఆంగ్లంలో ఎం.ఎ. లిటరేచర్, బ్రిటీష్ డ్రామా లీగ్ నుండి నటన దర్శకత్వంలో సర్టిఫికెట్ పొందారు.
- 1956 భారతీయ రైల్వే శాఖలో టిక్కెట్ కలెక్టర్గా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. పబ్లిక్ ఎడ్రసింగ్ సిస్టమలో బొంబాయి ఆకాశవాణిలో శిక్షణ పొందారు.
- చాట్ల 1976లో ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్ ఎం.ఆర్. అప్పారావు గారి కోరికపై స్టేజీ డైరెక్టర్ ఉద్యోగంలోకి ప్రవేశించారు. నాటకరంగంలో ఎన్నో ప్రయోగాలకు అదే నాంది అయింది. మధు ఫిల్మ్ ఇనిస్టిట్యూట్కు ప్రధానాచార్యులుగానూ, వివిధ కళాసంస్థల్లో సభ్యులుగానూ వ్యవహరిస్తున్నారు.
- వీరు గత 45 ఏళ్లుగా తెలంగాణా ప్రాంతంలో నాటకరంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. దాదాపు వందకు పైగా నాటకాలలో నటించి, దర్శకత్వం వహించారు. చాట్ల నటించిన నాటకాలలో 'మరో మొహంజోదారో' చాలా ప్రసిద్ధి చెందింది. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని అనేక మంది నటీనటులకు నటనలో శిక్షణ ఇచ్చారు.
- ఆధునిక తెలుగు నాటకరంగ చరిత్రలో కృత్తివెంటి నాగేశ్వర రావు, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, బళ్ళారి రాఘవ, అబ్బూరి రామకృష్ణా రావు, డాక్టర్ గరికపాటి రాజారావు, ఎ.ఆర్. కృష్ణ, కె. వెంకటేశ్వర రావు వంటి హేమాహేమీల జాబితాలో చాట్ల శ్రీరాములు పేరు కూడా కలిసిందంటే ఆయన నటనలో, దర్శకత్వంలో చేసిన అజరామరమైన కృషి, మేదస్సు రంగస్థలానికి నిలువెత్తు దర్పణం. దర్శకత్వంలో ఆయన చాలా ప్రయోగాలు చేశారు.
నటించిన సినిమాలు (filmography ):
- న్యాయం కావాలి
- స్వప్న
- ఆయనకి తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ బిరుదుతో సత్కరించింది.
- ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం : ప్రభుత్వం నియమించిన త్రిసభ్య కమిటీ సభ్యులు చాట్ట శ్రీరాములు గారిని 2009 సంవత్సరానికి గానూ ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఖమ్మంలో జరిగిన రాష్ట్ర ప్రభుత్వ నంది నాటకోత్సోవాల ముగింపు సందర్భంగా ఈ అవార్డును ఆయనకు రాష్ట్ర సమాచార, సినిమాటో గ్రఫీ మంత్రి డాక్టర్ గీతారెడ్డి అందజేశారు. ప్రభుత్వ సత్కారంతో పాటు ప్రత్యేక జ్ఞాపిక, రూ.లక్ష నగదు అందజేస్తారు.
- ==================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog