పాలగుమ్మి పద్మరాజు, Palagummi Padmaraju
పరిచయం (Introduction) : భీమవరం కళాశాలలో అధ్యాపకుడిగా ఉంటున్న పాలగుమ్మి పద్మరాజుగారిని 1954 లో ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి వాహినీ పతాకము కింద నిర్మించిన బంగారు పాప సినిమాకు మాటలు రాయమని పద్మరాజును కోరాడు. దీనితో మొదలుపెట్టి, పద్మరాజు సినీ రంగములో మూడు దశాబ్దాల పాటు పలు సినిమాలకు కథలు, పాటలు సమకూర్చాడు. ఈయన భక్త శబరి, బంగారు పంజరం వంటి అనేక సినిమాలలో పనిచేశాడు. ఈయన సినిమాలు విమర్శకుల ప్రశంసలు పొందినా వ్యాపారపరంగా విజయవంతము కాలేదు. దర్శకుడిగా బికారి రాముడు అనే చిత్రం తీశారు కానీ చిత్రం విజయవంతం కాలేదు. ఈయన నవల నల్లరేగడి ని 'మన (మా) వూరి కథ 'పేరుతో సినిమా తీశారు (కృష్ణ కథానాయకుడుగా). పడవ ప్రయాణం కథ ను 'స్త్రీ' పేరు తో చిత్రంగా నిర్మించారు (పా.ప. మరణానంతరం). రోహిణి కథానాయిక గా నటించిన చిత్రం వ్యాపార పరంగా విడుదల కాలేదు. ఈయన అనేక దాసరి నారాయణరావు సినిమాలకు ఘోష్టు రైటరుగా పనిచేశాడని వినికిడి.అంతకుముందు ఆయన కొన్ని డబ్బింగ్ చిత్రాలకు మాటలు రాశారు. 'పాపాల భైరవుడు' అన్న డబ్బింగ్ సినిమానికి రావికొండలరావు పద్మరాజుగారి దగ్గర సహాయకుడిగా చెయ్యడం...