M.S.Reddy(producer)-ఎం.ఎస్.రెడ్డి
పరిచయం (Introduction) :
- యం.యస్.రెడ్డి గారు ప్రముఖ తెలుగు సినిమా నిర్మాత మరియు రచియిత . చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కు..1963 లో నెల్లూరు లో సుందర్ మహల్ థియేటర్ ను నిర్మించారు . హైదరాబాద్ లో ' శబ్ధాలా స్టుడియోను స్థాపించారు . నిర్మాతగా, గేయకవిగా, పద్య కవిగా, పలు సంఘాలకు నాయకుడిగా...తెలుగువారికి దగ్గరైన యం.ఎస్.రెడ్డి ఇకలేరు. ఆయన మరణించారన్న (11-డిసెంబర్ 2011) వార్త సినీ అభిమానుల్ని కలవరపర్చింది. మంచి సినిమాలేకాదు, మంచి మనసు కలవారని సినీ పరిశ్రమలో ప్రతీ ఒక్కరూ ఆయనకు నివాళి అర్పించారు.
- పేరు : ఎం.ఎస్.రెడ్డి (పూర్తిపేరు -మల్లెమాల సుందర రామిరెడ్డి ),
- కలం పేరు : మల్లెమాల ,
- పుట్టిన తేదీ : 15- ఆగస్ట్ -1925 ,
- నివాసము : ఫిలిం నగర్ -హైదరాబాద్ ,
- పుట్టిన ఊరు : అలివిరి గ్రామము -నెల్లూరు జిల్లా , వెంకటగిరి తాలూక ,
- పిల్లలు : కొడుకు - శ్యాంప్రసాద్ రెడ్డి ,
- తొలి సినిమా : భార్య (తెలుగు),
- మరణము : 11.డిసెంబర్ 2011,
- నెల్లూరు జిల్లా వెంకటగిరి తాలూకాలోని అలిమిలి అనే మారుమూల గ్రామంలో 1924, ఆగస్టు 15న యం.ఎస్.రెడ్డి జన్మించారు. వీరిది కాస్త పేరున్న వ్యవసాయ కుటుంబం. అయినా కూడా కుటుంబ పరిస్థితులు అనుకూలించక చదువుకు దూరమయ్యారు. ఆర్థిక విషయాల్లో తండ్రి జాగ్రత్తగా ఉండకపోవటం వల్ల యం.ఎస్.రెడ్డి బాల్యం కష్టాలబాట పట్టింది. చదువుకోవాలనే ప్రయత్నం సాగలేదు. వ్యవసాయం చేద్దామనుకున్నాడు. అదీ ఫలించలేదు. చివరికి వడ్డెరవాళ్లతో కూలికి సైతం వెళ్లారు. 36 రూపాయాలు సంపాదించారు. ఇందులో నుంచి 20 రూపాయల పెట్టుబడితో తాటి పీచు కొట్టించి అమ్మడం చేశారు.
- వ్యాపార నిమిత్తం మద్రాస్ పయనం ఆయన్ని సినిమావైపు మరల్చింది. ఓ తమిళ డబ్బింగ్ సినిమా హక్కులు కొని, తెలుగులో విడుదల చేశారు. ఆ చిత్రం పేరు 'కన్నెపిల్ల'. 1966 డిసెంబర్ 26న విడుదలైంది. అదే రోజు ఎన్టీఆర్ కంచుకోట అనే చిత్రం విడుదలైంది. అయినా 'కన్నెపిల్ల' చిత్రం విజయం సాధించింది. తర్వాత కొంటెపిల్ల, కాలచక్రం అనే రెండు డబ్బింగ్ సినిమాలు విడుదల చేశారు. ఇవి అనుకున్నంత విజయాన్ని ఇవ్వలేదు. కె.యస్.ప్రకాష్రావుతో 'భార్య' అనే సినిమాను మొదలెట్టే సమయంలో శ్రీశ్రీ సాంగత్యం లభించింది. శ్రీశ్రీని ఇంట్లోకి సాదరంగా ఆహ్వానించి, కొడుకుతో కప్పు కాఫీ అందించి, శ్రీశ్రీ కాళ్లకు నమస్కరించమన్నారట.
- అందరికీ అంతో ఇంతో కొంతో ఇగో అనే ఫీలింగ్ ఉంటుందని పలు సందర్భాల్లో ఆయన చెప్పేవారు. 1971లో విడుదలైన 'శ్రీకృష్ణార్జున విజయం' కొద్ది లాభాలతో బయటపడ్డారు. కానీ 'ఎ.ఎస్.ఆర్ ఆంజనేయులు తీసిన 'పాండవ వనవాసం' విపరీతమైన లాభాల్ని తెచ్చిపెట్టింది. శోభన్బాబుతో తీసిన 'కోడెనాగు' కూడా మంచి విజయాన్నే అందుకుంది. చిత్రం ఎంత గొప్పగా తీసినా నిర్మాతకు కన్నీళ్లే మిగులుతాయని తను తీసిన 'దొరలు-దొంగలు' చిత్రాన్ని ఉదహరిస్తారు. ఇలా చలన చిత్ర జీవితం మూడు అడుగులు ముందుకు ఆరు అడుగులు వెనెక్కి నడిచిందని తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. ఆయన కష్టాలో ఉన్నప్పుడల్లా పాత పిక్చర్లలో వచ్చిన లాభాలే గట్టున పడేసాయి.--source : prajasakti news paper
- భార్య ,
- శ్రీకృష్ణ విజయం ,
- వూరికి ఉపకారి ,
- కోడెనాగు ,
- ముత్యాలపల్లకి ,
- ఏకలవ్య ,
- పల్నాటి సింహం ,
- బాల రామాయణం ,
- అంకుశం ,
- కన్నెపిల్ల ,
- కలిసిన మనసులు ,
- 2005 లో రఘుపతి వెంకయ్య అవార్డు పొందినారు .
- ================================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog