Kovvali Laxminarasimharao(writer)-కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత)
- -- courtesy with Ravi kondalarao@pathabangaram of eenadu news paper.
- ఆ రోజుల్లోని మధ్యతరగతి స్త్రీలకు పుస్తకాలు చదవడం నేర్పిన గొప్ప రచయిత కొవ్వలి లక్ష్మీనరసింహరావు. అవి- ఆయన రాసిన నవలలు. ''కొవ్వలి వారి నవలలు'' అంటే, ఆనాడు విపరీతమైన అభిమానం ఉండేది. కొత్త నవల మార్కెట్లోకి వచ్చిందంటే చాలు- అమ్ముడయిపోయేది. 64 పేజీల నవల. కొందరు ఇంటికి తెచ్చి అద్దెకిచ్చేవారు. ఒక రోజు పుస్తకానికి 'కాణీ' అద్దె. నవల వెల రెండు అణాలు. ఈ నవలల్లోని కథలు మామూలు కుటుంబ కథలు. మంచి వ్యావహారిక భాషలో, సహజమైన సంభాషణలతో రాసేవారు ఆయన. ఇవాళ కాలక్షేపానికి, టీవీ సీరియళ్లు చూసినట్టు- ఆ రోజుల్లో కొవ్వలి పుస్తకాలు గొప్ప కాలక్షేపం. రైలు ప్రయాణంలో ప్రతి వారి చేతిలోనూ కొవ్వలి నవల ఉండేది. ఈ చదివించే ధోరణిని- ఆయనే ప్రవేశపెట్టారు. అది ఒక యుగం! అప్పట్లోనే, ఆయన రాసినట్టుగానే ఇంకా మరికొందరు రచయితలు నవలలు రాస్తూ వచ్చారుగాని, ప్రథమ స్థానం కొవ్వలిదే.రాసిన మొత్తం నవలల సంఖ్య 1000కి పైగా
- పేరు : కొవ్వలి లక్ష్మీనరసింహరావు(రచయిత),
- పుట్టిన తేదీ : 01-07-1912,
- పుట్టిన ఊరు : తణుకు ,
- మరణము : 8-6-1975న ద్రాక్షరామంలో మరణించారు.
- 1935లో 'పల్లె పడుచులు
- వెయ్యో నవల పేరు- 'మంత్రాలయ'.
- వేయిన్నొకటి- 'కవి భీమన్న' (1975).
- బస్తీ బుల్లోడు,
- నీవే నా భార్య,
- వేగబాండ్ ప్రిన్స్,
- కరోడా,
- నీలో నేను-నాలో నీవు,
- రౌడీ రంగన్న,
- హలో సార్,
- ఇడియట్,
- ఛాలెంజ్,
- సవాల్,
- పైలా పచ్చీస్,
- లవ్ మేకింగ్,
- బడా చోర్,
- కిడ్నాప్,
- చస్తావ్ పారిపో,
- సీక్రెట్ లవర్,
- డార్లింగ్ డాలీ ,,
- 1941లో 'తల్లి ప్రేమ
- ''శాంతి'' చిత్రం 1952,
- 'మా గోపి'
- 'సిపాయి కూతురు' (1959),
- 'బీదల ఆస్తి' (1955),
- 'రామాంజనేయ యుద్ధం (1958)'
- ========================
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog