సుబ్బులక్ష్మి యం యస్ , Subbulakshmi M S
- ఆమె 'భారతరత్న.' శాస్త్రీయ సంగీత విదుషీమణి. ఆమె కీర్తనలు, కృతులు, సంకీర్తనలు, రాగాలాపనలూ వినని వారుండరు. ఆమె గురించి తెలియనివారూ వుండరు. మహాగాయనిగా జగద్విఖ్యాతి పొందిన ఆ సంగీత కళానిధి ఎమ్.ఎస్.సుబ్బులక్ష్మి. ఐతే, ఆమె పేరు చెప్పగానే మధుర స్వరాలు గుర్తొస్తాయిగాని, సినిమా నటీమణిగా కూడా రాణించి కీర్తి పొందిన విషయం గుర్తు రాదు.
- సుబ్బులక్ష్మి! రామదున్ నువ్వేగానం చేయాలి " అని మహాత్మా గాంధీ చేత , నాదేముంది ? నేనుకొక దేశానికి ప్రధానమంత్రిని మాత్రమే! ఆమె సంగీత సామ్రాజ్యానికే మహారాజ్ఞి ... అని జవహర్ లాల్ నెహ్రూ చేత , తనభారత కోకిల " బిరుదును సుబ్బులక్ష్మి కిచ్చేస్తున్నాని సరోజినినాయుడు చేత , సుబ్బులక్ష్మి సంగీత విద్వాన్సులకే విద్వాంసురాలు " అని కామ్రేడ్ జ్యోతిబసు చేత " సరస్వతి వీణాపాణి -అయితే సుబ్బులక్ష్మి వీణా కన్ఠి " అని కరైకుడిసాంబశివ అయ్యర్ చేత , "ఆహా! ఏమి స్వరం? ఆ స్వరము లో ఎంత వశీకరణ శక్తి వుంది ? " అని చెంబై వైద్యనాధఅయ్యర్ చేత , ఇంక ఎంతో మంది ప్రసంశలు పొందిన మహనీయురాలు .
- పేరు : చిన్నారి కుంజమ్మ ,
- వాసికెక్కిన పేరు : సుబ్బులక్ష్మి
- పుట్టిన ఊరు :మదురై (మధుర మేనాక్షి కోవెల సమీపమో లో ) తమిళనాడు ,
- పుట్టిన తేది : 16 సెప్టెంబర్ 1916
- కుటుంబము : దేవదాసీ కుటుంబము ,
- అమ్మమ్మ : అక్కమ్మాళ్ , వయోలిన్ కళాకారిణి ,
- అమ్మ : షణ్ముఖ వదివు , వీణ విద్వాంసురాలు
- నాన్న : సుబ్రమణ్య అయ్యర్ - న్యాయవాది .
- తోబుట్టువులు : అన్నా , చెల్లెలు , అందరు సంగీత కళాకారులే ,
- మాతృ భాష : తమిళం ,
- భర్త : సదాశివం . పాత్రికేయుడు , ౧౯౯౭ లో మరణించారు
- మరణము : 11 డిసెంబర్ 2004 - చని పోయిన "కౌసల్యా సుప్రజారామా !" అని ప్రతి ఉదయము మనల్నిమేల్కొలుపుతున్నారు .
- తన 12 వ ఏట నుండే సంగీత కచేరీలు చేసి ఎం.యస్. సుబ్బులక్షి గా మారేరు , 17 వ ఏట మద్రాసు మ్యూజిక్ అకాడమి లో చేసిన కచేరి ఆమె జీవితాన్ని మలుపు తిప్పింది . కచేరీలు చేస్తూ సినిమాలో నటించారు . సేవాసదనం సినిమా , శకుంతల సినిమా , 1940 లో పముఖ వ్యాపారి , పత్రిక విలేఖరి , స్వాతంత్ర్యోద్యమ నాయకుడు అయిన " సదాశివం " ను వివాహమాడినారు . వివాహము అనంతరము "మీరా " సినిమాలో నటించారు . నటించిన చివరి సినిమా " సావిత్రి " లో నారద పాత్రను వేసారు . వీరు కల్కి అనే పత్రికను నడిపేవారు .ఈమె తమిళం తో పాటు , తెలుగు , బెంగాల్ , కన్నడం , మలయాళం , గుజ రేట్ , హిందీ , సంసృతం లో ఎన్నో గీతాలు పాడేరు . ప్రముకము గా -మీరా భజనలు , కబీర్ దాస్ , సూరదాస్ , తలసేదాస్ , గురునానక్ ల భజనలు ,, అన్నమాచార్య కీర్తనలు ,క్స్తేత్రయ్య మువ్వగోపాలపదాలు , భక్తరామదాసు కీర్తనలు , భక్త తుకారం పద్యాలూ , తన కచేరీలలో ఆలపించారు .
- మీరా' తర్వాత సుబ్బులక్ష్మి సినిమాలకు స్వస్తి చెప్పి, శాస్త్రీయ సంగీతం మీదనే మససు, దృష్టీ పెట్టి విరివిగా కచేరీలు చేసింది. కచేరీల ద్వారా వచ్చిన లక్షలాది రూపాయల్ని పేద ప్రజలకి అందజేసిందామె. నటించినవి ఐదేఐదు చిత్రాల్లో అయినా, అజరామరమైన ఖ్యాతి సంపాదించింది సుబ్బలక్ష్మి.
- 1954 లో "పద్మ భూషణ్ ,
- 1968 లో మద్రాసు సంగీత అకాడమి వారి "సంగీత కళానిధి "
- 1974 లో "రామన్ మేగాస్సే అవార్డు ,
- 1988 లో మహారాష్ట్ర " మెంబర్ ది ఆనర్ "
- 1988 లో " స్పిరిట్ అఫ్ ఫ్రీడం అవార్డు "
- 1990 లో "ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా వార్డు ,
- 1998 లో " భారతరత్న ,
- సేవాసదనం 1938 ,
- శకుంతల
- సావిత్రి 1941 ,
- మీరా 1945 ,
- (Source : వార్తా తెలుగు దిన పత్రిక )
==========================
- Visit my website : dr.seshagirirao.com
Comments
Post a Comment
Your comment is necessary for improvement of this blog